Thursday, October 24, 2024

కొత్త వేరియెంట్ కలకలం

- Advertisement -
- Advertisement -

వరంగల్ ఎంజిఎంలో చేరిన రోగి
రాష్ట్రంలో కొత్తగా 6 కొవిడ్ కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి మరోసారి హడలెత్తిస్తుంది.గురువారం కొత్తవేరియంట్ లక్షణాలతో ఎం జీఎంకు వచ్చిన ఓ రోగినిఅక్కడి వైద్యులు కోవిడ్ వార్డుకు తరలించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్దారణ పరీక్షలు ని ర్వహించగా కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 మంది ఐసొలేషన్‌లో ఉండగా 54 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని ఆ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News