Thursday, September 19, 2024

ఊటీలో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి..

- Advertisement -
- Advertisement -

ఊటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది తెలియరాలేదు. ప్రస్తుతం సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనాసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News