Saturday, April 12, 2025

పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో సమీపంలో ఉన్న వనమాలి పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఐదు ఫైర్ ఇంజన్లతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో పరిశ్రమంలో 11 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News