Tuesday, September 17, 2024

గిల్ ఔట్.. నిలకడగా ఆడుతున్న బారత్

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 261 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుబ్ మన్ గిల్ 38 పరుగులు చేసి సోయిబ్ బషీర్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(45), రజత్ పాటీదర్(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News