Friday, October 18, 2024

ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ముర్ముకు సిఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు శుక్రవారం స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్రపతి ముర్ము నగర శివారులోని కన్హ శాంతి వనానికి వెళ్లనున్నారు. అనంతరం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, హార్ట్ ఫుల్ నెస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఆధ్యాత్మికవేత్తలు హాజరుకానున్న ఈ సమ్మేళనంలో రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రాజ్ భవన్‌కు చేరుకొని శుక్రవారం రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News