Saturday, April 12, 2025

కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సోమవారం కవిత బెయిల్ పిటిషన్ పై విచారించిన సిబిఐ స్పెషల్ కోర్టు.. మెరిట్ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 4వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఆ రోజు లంచ్ తర్వాత వాదలన వింటామని జడ్జి స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 16వరకు కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News