Friday, October 18, 2024

ఈ నెల 21న గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో (ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి) ప్రవేశాలకు ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థుల నుండి ఆన్ లైన్ (http://tsrjdc.cgg.gov.in) ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులు జిల్లా కేంద్రాలు హైదరాబాద్, మహాబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట,

సంగారెడ్డి జిల్లాలలో ప్రవేశ పరీక్ష 21-న ఉదయం. 10 గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ తెలిపారు. సంబందిత పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన 73,527 మంది విద్యార్థులలో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఇప్పటివరకు హాల్టికెటు డౌన్లోడ్ చేసుకున్నారని మిగిలిన విద్యార్థులు పైన తెలిపిన అన్ లైన్ ద్వారా ఈ నెల 21న ఉదయం 8 గం.ల వరకు హాల్ టికెట్స్ పొందవచ్చని తెలిపారు. కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగా చూడాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News