Saturday, October 5, 2024

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. విత్తనాల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది..? అని ప్రశ్నించారు. నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!! పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని కెటిఆర్ పేర్కొన్నారు.సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా..? అని నిలదీశారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా..? అని ప్రశ్నించారు.

గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు.. ఇప్పుడు 10 గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా..? అని నిలదీశారు. రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటీ కష్టాలు..ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా..?…బిఆర్‌ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా..అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కళ్లెం వేయండి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి… లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!! అని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News