Friday, October 18, 2024

తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే వేలాది మంది అమరులయ్యారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ చేసిన పాపలతోనే అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చిందని, 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందని,  1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు అని చురకలంటించారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే.. తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? అని ధ్వజమెత్తారు.  2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? అని కెటిఆర్ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరు? అని నిలదీశారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News