Saturday, October 5, 2024

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఆదివారం(జూన్ 2) జరుగుతుంది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), నవీన్‌కుమార్ రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్(స్వతంత్ర)లు పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. అలాగే నల్గొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికకు కౌంటింగ్ జూన్ 5న జరుగుతుందని సిఇఒ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News