Friday, October 18, 2024

బిజెపి కోసం…బిఆర్‌ఎస్ ఆత్మబలిదానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో లోకసభ ఎన్నికల ఫలితాలు సంతృప్తి ని చ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా రు. కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వ చ్చాయన్నారు. బిజెపిని గెలిపించేందుకు బి ఆర్‌ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకు ని అవయవదానం చేశారని, బిజెపి గెలుపు కోసం కృషి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించా రు. బుధవారం తన నివాసం వద్ద సిఎం మీ డియాతో మాట్లాడుతూ బిజెపి గెలిచిన స్థా నాల్లో బిఆరెస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీశ్‌రావు తమ ఓట్లను పూర్తిగా బి జెపికి బదిలీ చేశారని, రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారన్నారు. వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసిన కెసిఆర్ బిజెపిని గెలిపించారన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వారికి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని, వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగినట్లు ఆయన చెప్పారు.

ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండమని చెప్పారు. 17 పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని, ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారన్నారు. 2019లో బిజెపి 4 సీట్లు గెలిస్తే, ఈ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35శాతానికి పెరిగాయని, అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బిఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయిందన్నారు. 2023లో 13 శాతం ఓట్లున్న బిజెపికి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతానికి ఓట్లు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో బిఆరెస్ ఎంఎల్‌ఎల ఆత్మ గౌరవాన్ని కెసిఆర్ , కెటిఆర్, హరీశ్‌రావు బిజెపికి తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కెసిఆర్ రాజకీయ ఆరాచకానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానం అయ్యి బిజెపికి కెసిఆర్ మద్దతుగా నిలిచారని ఆరోపించారు. బూడిదైన బిఆర్‌ఎస్ మళ్లీ పుట్టేది లేదన్నారు. వంద రోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బిఆరెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కుట్రపూరితంగా వ్యవహరించిన బిఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారని ఆయన హరీశ్‌రావునుద్దేశించి అన్నారు.

మోడీ గ్యారంటీకి వారంటీ చెల్లింది
మోడీ గ్యారెంటీ పేరుతో బిజెపి నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారని, బిజెపి 303 సీట్ల నుంచి 243కి పడిపోయిందని, మోడీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారని సిఎం అన్నారు. దేశ ప్రజలు మోడీని తిరస్కరించారని, ఆయన తక్షణమే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తిరస్కరణకు గురైన మోడీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు. విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోడీకి గౌరవం ఉంటుందని హితువు పలికారు. ఇప్పటికైనా బిజెపి అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలని కోరారు. ఇప్పటివరకు 18 గంటలే పనిచేసాం, ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత తనదేనని, వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివివని చమత్కరించారు.

కెసిఆర్ బిజెపితో బేరసారాలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిఆరెస్ ఎంఎల్‌ఎలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలని కోరారు. కెసిఆర్ ఒక రాజకీయ జూదగాడని, ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అత్యంత అవినీతి పరుడు అన్న బిజెపి, బిఆరెస్ తో ఎలా జతకడుతుందో చూడాలన్నారు. ఎపిలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News