Tuesday, October 22, 2024

రెవెన్యూ ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేర్పులు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. అలాగే రెవెన్యూశాఖ ప్రక్షాళన దిశగా చర్యలు ముమ్మరం చేసినట్ల ఆయన తెలిపారు. శు క్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొంగులేటి ధరణి కమిటి సభ్యులు ఎం. కో దండ రెడ్డి, ఎం.సునిల్ కుమార్, మధుసూదన్ లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప లు కీలక అంశాలపై కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలా ది కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తాను ఖమ్మం జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పైగా భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్‌ను పునర్ వ్యవస్థీకరించి చట్టాలలో మార్పు లు తేవాల్సిన అవసరం ఏర్పడిందని ఈ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నార ని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ (ధరణి) ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని, ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చి న సమస్యలను అధ్యయనం చేయడానికి అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ సభ్యులు చేసిన సిఫారసులపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించామని, కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించేకంటే ముందు అన్నీ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ కమిటీ రాష్ట్రంలో భూ సంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలోని ఆర్‌ఓఆర్ యాక్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించిందని చెప్పారు.

భూమి వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించిందని మంత్రిగారు వెల్లడించారు. లోపభూయిష్టమైన 2020 ఆర్‌ఓఆర్ చట్టాన్ని తద్వారా రూపొందించిన ధరణి పోర్టల్ ను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ధరణి పోర్టల్ లో మార్పులు-చేర్పులు చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బి లో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News