Tuesday, October 22, 2024

కెటిఆర్‌కు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కెటిఆర్ ఎన్నికల అఫిడవిట్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు కెకె. మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల అఫిడవిట్లలో కెటిఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. కెటిఆర్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News