Saturday, October 26, 2024

కెనడాతో భారత్ మ్యాచ్ రద్దు

- Advertisement -
- Advertisement -

కెనడా భారత్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్‌ఎ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ గ్రూప్ నుంచి భారత్‌తో పాటు ఆతిథ్య అమెరికా టీమ్ సూపర్8కు అర్హత సాధించాయి. మ్యాచ్ ఆరంభానికి ముందు భారీ వర్షం కురిసింది. దీంతో సెంట్రల్ పార్క్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో స్టేడియం తడిసి ముద్దయ్యింది. మైదానం మొత్తం వర్షం నీరుతో నిండిపోయింది. తర్వాత వర్షం తగ్గు ముఖం పట్టినా ఫలితం లేకుండా పోయింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కానీ వర్షం వీరి ఆశలపై నీళ్లు చల్లింది.

భారీ వర్షం వల్ల మైదానం చెరువును తలపించింది. అయిత్ స్టేడియాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికీ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో భారత్, కెనడా జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా, గ్రూప్‌ఎలో భారత్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా ఇంతకు ముందే సూపర్8కు చేరుకుంది. ఇక భారత్‌కెనడా మ్యాచ్ రద్దు కావడంతో ఐదు పాయింట్లతో ఉన్న అమెరికా ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి.

సందడే..సందడి..
మరోవైపు మ్యాచ్ రద్దయినా భారత క్రికెటర్లు అభిమానులను కనువిందు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపించారు. భారత సీనియర్, జూనియర్ క్రికెటర్లతో ఫొటోలు దిగేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపించారు. అభిమానులే కాకుండా కెనడా క్రికెటర్లు సయితం భారత ఆటగాళ్లతో సెల్ఫీలు దిగారు. కోహ్లితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. మ్యాచ్ జరగక పోయినా టీమిండియా క్రికెటర్లు మాత్రం స్టేడియంలో సందడి చేసి అభిమానులను అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News