Saturday, October 5, 2024

ఐఇడితో ట్రక్కు పేల్చివేత.. ఇద్దరు కోబ్రా సిబ్బంది హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం నక్సలైట్లు ఒక ఐఇడితో ఒక ట్రక్కును పేల్చివేయగా సిఆర్‌పిఎఫ్ అటవీ యుద్ధతంత్ర విభాగం కోబ్రా సిబ్బంది ఇద్దరు హతులైనట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయిపూర్‌కు 400 పైగా కిలో మీటర్ల దూరంలో భద్రత దళాల సిల్గేర్, టెకల్‌గూడెమ్ శిబిరాల మధ్య తిమ్మాపురం గ్రామం సమీపాన ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నక్సల్ ఐఇడి పేల్చారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు, టెకల్‌గూడెమ్ వైపు రోడ్ ఓపెనింగ్ బృందం విధుల్లో భాగంగా జగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గేర్ శిబిరం నుంచి కోబ్రా 201వ యూనిట్ అడ్వాన్స్ పార్టీ గస్తీ ప్రారంభించిందని ఆయన తెలియజేశారు.

భద్రత సిబ్బంది ఒక ట్రక్కులోను, మోటార్‌సైకిళ్లపైన ఉన్నారని ఆయన తెలిపారు, నక్సల్స్ ట్రక్కు లక్షంగా ఐఇడి పేల్చగా కాన్‌స్టేబుల్ శైలేంద్ర (29), వాహనం డ్రైవర్ విష్ణు ఆర్ (35) మరణించారని ఆయన తెలిపారు, పేలుడు గురించి సమాచారం అందగానే మరిన్ని బలగాలు హుటాహుటిన ఆ ప్రదేశానికి బయలుదేరాయని, మృతదేహాలను అడవిలో నుంచి తరలిస్తున్నారని ఆయన చెప్పారు, ఆ ప్రాంతంలో గాలింపు సాగుతోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News