Saturday, October 5, 2024

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ఎంపీ లక్ష్మణ్‌

- Advertisement -
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని బిజెపి ఎంపి లక్ష్మణ్‌ అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నానన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. భాజపా ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బిజెపి వ్యతిరేకించిందన్నారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఎంపీ లక్ష్మణ్‌ ఫైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News