Saturday, October 5, 2024

గందరగోళంగా మారిన జిహెచ్ ఎంసి సమావేశం

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బిఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని, మేయర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీనే అని మేయర్ మండిపడ్డారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బిఆర్ఎస్ కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ఆందోళనలు ఆపకపోతే… సమావేశాన్ని నిరవధికంగా వాయిదావేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో… సమావేశాన్ని ఆమె 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బిఆర్ఎస్ తరపునే గెలుపొందారు. ఇటీవలే వారూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బిఆర్ఎస్ సిద్ధమయింది. ఈ క్రమంలోనే వీరి రాజీనామాకు బిఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News