Sunday, October 6, 2024

తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల పరిష్కారమే లక్ష్యం కావాలి: వెంకయ్య నాయుడు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల పరిష్కారమే లక్ష్యం కావాలి
రేవంత్, చంద్రబాబు భేటీపై వెంకయ్యనాయుడు ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. “రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కావడం ఒక మంచి ముందడుగు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రజా భవన్‌లో చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన ఫొటోను ట్యాగ్ చేశారు. కాగా, గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారమే ఏజెండాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదిగా జరిగిన ఈ భేటీ దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఈ భేటీలో విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు చర్చించారు. అనంతరం విభజన సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News