Sunday, October 6, 2024

ఉపాధ్యాయుడిని పొడిచి చంపిన విద్యార్థి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: మార్కులు తక్కువ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించడంతో అతడిని బాలుడు పొడిచి చంపిన సంఘటన అస్సాంలోని శివసాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 11వ తరగతి విద్యార్థి రసాయన శాస్త్రంలో తక్కువ మార్కులు రావడంతో రాజేశ్ బారువా విజయవాడ(55) అనే ఉపాధ్యాయుడు బాలుడిని మందలించాడు. తలిదండ్రులను తీసుకరమ్మని ఇంటికి పంపాడు. విద్యార్థి కత్తితో పాఠశాలకు హాజరయ్యాడు. తరగతి గదిలో  రాజేశ్ రాగానే అతడిపై విద్యార్థి కత్తితో దాడి చేశాడు. కత్తి తలలోకి దిగడంతో వెంటనే రాజేశ్‌ను తొటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఉపాధ్యాయుడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News