Thursday, September 19, 2024

ట్రాక్టర్ ను ఢీకొట్టి… లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి హైవే ఎక్స్ ప్రెస్ పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో రెండు వాహనాలు 20 అడుగుల లోతుగల లోయలో పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆషాడం ఏకాదశి సందర్భంగా భక్తులు పందార్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News