Tuesday, September 17, 2024

ఎల్‌ఓసి వద్ద ఇద్దరు తీవ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరులోని కుప్వారా జిల్లాలో గురువారం వాస్తవాధీన రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఉత్తర కశ్మీరు జిల్లాలోని కేరన్ సెక్టార్‌లోని ఎల్‌ఓసి వెంబడి చొరబాటుకు తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు. దేశ సరిహద్దుల్లోకి చొరబాటుకు యత్నించిన తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఇద్దరు తీవ్రవాదులు మరణించినట్లు అధికారులు తెఇపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News