Sunday, October 6, 2024

నేటి నుంచి మహిళల ఆసియాకప్

- Advertisement -
- Advertisement -

దంబుల్లా: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్‌తో సహా 8 జట్లు పోటీ పడుతున్నాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, యుఎఇ, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో ఆతిథ్య శ్రీలంకతో పాటు మలేసియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియాకప్ 28న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లన్నీ దంబుల్లాలోని రణ్‌గిరి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

యుఎఇ, నేపాల్ జట్ల మధ్య శుక్రవారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేస్తోంది. ఇక శుక్రవారం రాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో భారత్‌పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి ఏడు గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. ఆసియాకప్ టోర్నమెంట్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

మరోవైపు ఈ టోర్నీలో అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఎలాంటి రుసుం లేకుండానే మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. కాగా, లీగ్ దశలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని జట్టుతో ఓ మ్యాచ్ ఆడుతుంది. ఇక ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జులై 26న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ఫైనల్ పోరు జులై 28న జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News