Thursday, September 19, 2024

తెలంగాణలో పాఠశాలల టైమింగ్స్ మార్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ శనివారం పాఠశాలల వేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లో సమయాలను మార్పు చేసింది. ఉన్నత పాఠశాల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పనివేళలు ఉండేవి. ఇప్పుడు సమయాన్ని ఉదయం అరగంట  ముందుకు జరిపి, సాయంత్రం వేళ కూడా ముందుకు జరిపింది.

కాగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉన్న పని వేళలు అదే మాదిరి  కొనసాగుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జంటనగరాల్లో పాఠశాలలు ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News