Friday, October 18, 2024

నవంబర్‌లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్-2

- Advertisement -
- Advertisement -

ది రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్‌బోర్న్‌కి చారిటీ కోసం టిసిఎ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు టిసిఎ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2ని నవంబర్‌లో నిర్వహిస్తున్నారు.

ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్‌బోర్న్‌కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాయి, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్, ఓంకార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్.. ‘2006లో స్థాపించారు. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత సులభం కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్‌లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. నిర్వహాకులు సాయి ఒక చారిటీ కోసం ఈ క్రికెట్ కార్నివాల్‌ని నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News