Friday, October 18, 2024

అసెంబ్లీకి హాజరైన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి. దాదాపు ఏడు నెలల తర్వాత ఆయన అసెంబ్లీలో కాలు పెట్టారు. ఆయన అధికారం కోల్పోయాక అసెంబ్లీకి రావడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.  ఆయన కాసేపు తన ఛాంబర్ లో ఎంఎల్ఏలతో మాటామంతీ నెరిపారు. ప్రతిపక్షంగా ఎలా మాట్లాడాలి అన్న వ్యూహాన్ని వారికి తెలిపారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News