Friday, October 18, 2024

దోకేబాజ్ బడ్జెట్..దండగమారి బడ్జెట్: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఇది పూర్తిగా కోతల, ఎగవేతల బడ్జెట్ మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికల వాగ్ధానాలను గాలికి వదిలేసి ప్రజలను వంచించారని ఆరోపించారు. ఇది డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన దోకేబాజ్ బడ్జెట్ అని కెటిఆర్ ఎక్స్ వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు. ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని.. వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్ అని పేర్కొన్నారు.

విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్ అని విమర్శించారు. రైతులకు కత్తిరింపులు…అన్నదాతలకు సున్నం..ఆడబిడ్డలకు అన్యాయం..మహాలక్ష్ములకు మహామోసం అని ఎద్దేవా చేశారు. అవ్వాతాతలకు..దివ్యాంగులకు.. నిరుపేదలకు…నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదని మండిపడ్డారు. దళితులకు దగా..గిరిజనులకు మోసం.. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలిందని అన్నారు. బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారని పేర్కొన్నారు.

మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..నిరుద్యోగుల ఆశలపై నీళ్లు.. 4 వేల భృతి జాడా పత్తా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై కూడా వివక్షే..5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు.. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదని అన్నారు. మొత్తంగా..పసలేని..దిశలేని..దండగమారి బడ్జెట్ అని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News