Friday, October 18, 2024

 బాలిక ప్రాణం తీసిన సెల్ ఫోన్ చార్జర్

- Advertisement -
- Advertisement -

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి తొమ్మిదేళ్ల బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం….
మత్కేపల్లి గ్రామంలో కటికాల రామకృష్ణ-సుధారాణి అనే దంపతులకు అంజలి కార్తీక్(8) అనే కూతురు ఉంది. బాలిక స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. అంజలి అప్పుడే బాత్రూమ్ వెళ్లి రూమ్‌లోకి వచ్చిన తరువాత సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టింది. బాలిక చేతులు తడిగా ఉండడంతో షాక్ తగిలి కిందపడిపోయింది. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయిందని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పిల్లలు, పెద్దలు తడి చేతులతో విద్యుత్ పరికరాలను పట్టుకోవద్దు. వానాకాలం కావడంతో గోడలు తడిగా ఉండి షాక్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News