Friday, September 20, 2024

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరబాద్ : హైదరబాద్‌లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఇడి సోదాలు నిర్వహించింది. బ్యాంకుకు సంబంధించిన ఆరు కీలక ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న ఇళ్లల్లో మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండి పురుషోత్తం దాస్, సిఇఒ, డైరెక్టర్ల ఇళ్లతో పాటు సోలిపురం వెంకట్ రెడ్డి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇడి విచారణ ప్రారంభించినట్లుగా సమాచారం. అనర్హులకు రుణాలు ఇచ్చి హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తోంది. అయితే అయితే బ్యాంకులో రుణాల వ్యవహారం వివాదాస్పదమవుతోంది.

కంపెనీలోని వాటాదారులు ఇతరులతో కుమ్మక్కయి పెద్ద ఎత్తున రుణాలను అనర్హులకు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ లో కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై ఇడికి సమాచారం వెళ్లడంతో సోదాలు నిర్వహించారు. మహేష్ బ్యాంక్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆ సంస్థ సైబర్ సెక్యూరిటీని పట్టించుకోలేదు. ఈ కారణంగా సైబర్ దాడులు జరిగాయి. నైజీరియా నుంచి సైబర్ దాడులు జరిగి నడబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ సైబర్ పోలీసులు అసలు విషయం తేల్చేశారు. మహేశ్ బ్యాంక్ యాజమాన్యం సైబర్ సెక్యూరిటీపై నిర్లక్ష్యం చేసిందని, అందువల్లే సర్వర్ హ్యాక్ చేసి నగదు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫర్ జరిగిందని దర్యాప్తులో తేలింది. నైజీరియన్ హ్యాకర్లు మొదట బ్యాంకు ఉద్యోగులకు మెయిల్స్, మెస్సేజ్ లు పంపి తరువాత బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి పలు ఖాతాలకు కొల్లగొట్టిన నగదును ట్రాన్స్ ఫర్ చేశారు.

హైదరాబాద్ సైబర్ పోలీసులు నేరుగా ఆర్బీఐ గవర్నర్ కే ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీని పట్టించుకోని బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సైతం ఆర్బీఐకి సూచించారు. అయితే చట్టపరంగా ఒక బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడం సాధ్యం కాదని మహేశ్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా డిపాజిటర్లు, ఖాతాదారుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని గట్టిగా మహేశ్ బ్యాంకు నిర్వాహకులను ఆర్బీఐ మందలించింది. ఆ తర్వాత ఇప్పుడు రుణాల స్కామ్ వెలుగు చూడటం సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News