Friday, September 20, 2024

హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నా.. ఎక్కడకు రమ్మంటావో చెప్పు: దానంకు కౌశిక్ రెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నాను… ఎక్కడకు రమ్మంటావో చెప్పు అంటూ మాజీ మంత్రి దానం నాగేందర్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డిలను ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా? అని ప్రశ్నించారు.

దానం నాగేందర్‌కు ప్రస్తుత ఎమ్మెల్యే పదవి కెసిఆర్ పెట్టిన భిక్ష అన్నారు. ఆయనకు సిగ్గుంటే తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది కెసిఆర్ మాత్రమేనన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కెసిఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగ ఖాళీలతో జాబ్ వివరాలు లేవన్నారు.

జాబ్ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదన్నారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. శాసనసభలో బిఆర్‌ఎస్ సభ్యులపై ఇష్టమొచ్చినట్లుగా అసభ్యపదజాలంతో దూషించారని దానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌కు సిఎం మైక్ ఇప్పించి తమను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే దానం నీచమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దానం చేసిన విమర్శలన్నీ నిరుద్యోగులను ఉద్దేశించి చేసినవే అన్నారు. ఆయన బెదిరింపులకు భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News