Tuesday, September 17, 2024

విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన 3 బోగీలు

- Advertisement -
- Advertisement -

విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం స్టేషన్ లో ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు, సిబ్బంది.. ప్రయాణికులను బయటకు పంపించారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. హుటాహుటినా సంఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం1 బోగీలు మంటల్లో తగలబడిపోయాయి.  ఈ  ఘటనన సమంయలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం జరిగింది. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News