Friday, September 20, 2024

జర్నలిస్ట్ మధునయ్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: సీనియర్ పాత్రికేయుడు, సింగరేణి మాజీ కార్మికుడు నాయిని మధునయ్య బుధవారం గోదావరిఖని హనుమాన్ నగర్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఆయన మరణంపై వివిధ పార్టీల నాయకులు, పాత్రికేయులు, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన తన సూసైడ్ నోట్ లో తన చావుకు పలువురు కారణమని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మధునయ్య మరణం స్థానికంగా సంచలనం రేపింది. ఆయన తన సూసైడ్ నోట్ లో ఎంఎల్ఏ మక్కాన్ సింగ్, మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంఎల్ఏ కోరుకంటి చందర్, జర్నలిస్టు మిత్రులు తన కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. మధునయ్యకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News