Friday, September 20, 2024

హైదరాబాద్‌లో ఛార్లెస్ స్క్వాబ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఛార్లెస్ స్క్వాబ్ కొత్తగా టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ప్రతినిధులు సిఎం రేవంత్‌రెడ్డితో గురువా రం చర్చలు జరిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కం పెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

భారత్‌లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భా గంగా డల్లాస్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జ రిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవం తం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని వారు చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రా ష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెం టర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

డల్లాస్‌లో మహాత్ముడి విగ్రహానికి సిఎం నివాళి
డల్లాస్ నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి సిఎం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా డల్లాస్‌లో ఏర్పాటు చేసిన ఈ గాంధీ విగ్రహం అమెరికాలోనే అతి పెద్దది కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News