Thursday, September 19, 2024

సుంకిశాల పాపం బిఆర్‌ఎస్‌దే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డతో పా టు సుంకిశాల పాపం బిఆర్‌ఎస్‌దేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్లు లో పభూయిష్టంగా ఉన్నాయని, కూలే గోడలు కట్టిం చి మరొకరిపై బురదజల్లే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సుంకిశాల బిఆర్‌ఎస్ హయాంలో నే నిర్మించారని, వాటి డిజైన్లు సైతం లోపభూయిష్టంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అది తాము కట్టించింది కాదని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి బిఆర్‌ఎస్ ప్రభుత్వ త ప్పిదాలు తమపై వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ తమపై బురదజల్లే ప్రయ త్నం చేస్తుందని, వాటిని ప్రజలు క్షమించరని అ న్నారు. సుంకిశాలపై విచారణ చేసి వివరాలు అందజేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు.

టిజిఎస్‌పిడిసిఎల్ ప్రధాన కార్యాలయం లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో గురువా రం సమీక్షా సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవాళ కూలినగోడ గత బిఆర్‌ఎస్ హయాంలో కట్టించినదేనని స్పష్టం చేశారు. సుంకిశాల నిర్మాణంతో ప్రజల సొమ్మును వృథా చేశారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమే కాదని, బీఆర్‌ఎస్ కృష్ణా నదిని కూడా వదిలిపెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్స్, ఎస్సీలు, ఏడీలతో సమావేశం నిర్వహించామని చెప్పారు. హైదారాబాద్ మహా నగరంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటాయని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భట్టి ఆదేశించామన్నారు.

నగర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా స్తంభాలు పడిపోవడం, చెట్లు కూలిపోయే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించామని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు బీఆర్‌ఎస్ హయాంలోనే చేపట్టారని, సాగర్‌లో నీళ్లు వచ్చినందునే గోడ కూలిందని ఆరోపిస్తున్నాన్నారు. నీళ్ల కోసమే కదా సాగర్ కట్టిందని, గత ప్రభుత్వ ప్రాజెక్టు డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతోందన్నారు. మీ కట్టడాలు, మీ పాలన ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోందని, సుంకిశాల ప్రాజెక్టు మేం కట్టింది కాదని, మా హయాంలో చేపట్టిన ప్రాజెక్టు కాదన్నారు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం మీకే చెందుతుందని -ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

విద్యుత్ సమస్యలపై 1912కి కాల్ చేయండి : విద్యుత్ శాఖలో పదోన్నతులపై చర్యలు చేపట్టాలని సీఎండీలను ఆదేశించామని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ శాఖలో గత ఏడెనిమిది ఏళ్లుగా పదోన్నతులు లేవని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పామని వివరించారు. అనేక అంతర్జాతీయ సంస్థలు వస్తుంటాయని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించామని తెలిపారు. వినియోగదారుల కోసమే నిరంతరం విద్యుత్ సిబ్బంది పని చేస్తున్నారని, విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే విద్యుత్ శాఖ స్పందిస్తుందన్నారు.

నాణ్యమైన సేవలు అందించండి : అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు. వారు నాణ్యమైన విద్యుత్తు, లా అండ్ ఆర్డర్, మంచినీటి వసతి అడుగుతున్నారు. హైదరాబాద్ కు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, జీవితం హాయిగా ఉంటుందన్న భావన ఏర్పడాలన్నారు. నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయం అందిస్తే పరిశ్రమలు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జిడిపి పెరుగుతుంది అన్నారు. ఉద్యోగాలు రావాలని, జీవనస్థితిగతులు మారాలని, ప్రపంచంతో పోటీ పడాలని బాధ, ఆవేదనతో కోరి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అన్న విషయాన్ని విద్యుత్ సిబ్బంది గమనంలో పెట్టుకొని నాణ్యమైన సేవలు అందించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News