Friday, September 20, 2024

నాంపల్లిలో అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలోని ప్లెజెంట్ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు, మద్దతుదారుల దాడి చేశారు. అపార్ట్ మెంట్ లోని మహిళలు, యువకులపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడి అసభ్య పదజాలంతో దూషించారు. అపార్ట్ మెంట్ ముందుభాగం ఆక్రమణల తొలగింపు విషయంలో వివాదం నెలకొంది. అపార్ట్ మెంట్ లోకి ఎంఐఎం మద్దతుదారులు చొచ్చుకొచ్చి వారిపై దాడి చేయడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. పాతబస్తీలో ఐఎంఎం ఆగడాలకు అంతులేకుండా పోతుందని అపార్ట్ మెంట్ వాసులో వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News