Thursday, September 19, 2024

దాంతో ఆర్థిక వ్యవస్థలో పెను మార్పు తీసుకొస్తాం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత దేశ ప్రజల కలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని మోడీ తెలిపారు. 2047 నాటికి విసిత్ భారత్ మనందరి లక్ష్యమని స్పష్టం చేశారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 నినాదం తమది అని, 140 కోట్ల మంది కలల తీర్మానం అని పేర్కొన్నారు. భారత్ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా భారత్ ను మార్చాలన్నదే  తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేశారు. రక్షక దళాల గౌరవ వందనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. అనంతరం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని తెలిపారు. మరో పది కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలని ఆకాంక్షించారు.

అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందని, అంతరిక్ష రంగంలో వందలకొద్ధీ స్టార్టప్ లు వచ్చాయని, ప్రైవేటు ఉప గ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మౌలిక సదుపాయాల్లో పెను మార్పులు తీసుకొచ్చామని, దేశ హితానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కోరారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని, దేశాభివృద్దికి పాలనా సంస్కరణలు అవసరం ఉందని, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం ఉందని తెలియజేశారు. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలని, వోకల్ పర్ లోకల్ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థలో పెను మార్పు తీసుకోస్తామని మోడీ తెలియజేశారు. సర్జికల్ స్ట్రైక్స్ ను దేశం ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. అభివృద్ధిని బ్లూప్రింట్ గా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News