Thursday, September 19, 2024

అక్రమ నిర్మాణాలపై వెనకడుగు లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల కు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జ రుగుతోందని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపా రు. ఈ విధంగా ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్ పని చేసిందని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతల పై ఒత్తిళ్లు వస్తున్నాయి, అయినా వెనక్కి తగ్గేది లేద ని సిఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసిందని చెప్పారు. జన్వాడ ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో కేటీఆర్ ప్రస్తావించలేదని సీఎం పేర్కొన్నారు.

నిర్మాణాల కు అధికారులే అనుమతిస్తారు, సర్పంచులు కా ద ని కేటీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. తన కుటుం బం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌కు మాత్రమే హైడ్రా పరిమితం అని స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. అలాగే చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యం అని అన్నారు.

చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధారణ కమిటీ
30 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలైనా హైడ్రా చర్య లు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధరణ కమిటీ వేస్తామని వెల్లడించారు. హరీశ్‌రావు నేతృత్వం వహిస్తానంటే ఆయన నేతృత్వంలోనే కమిటీ వేస్తామని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయి, వెనక్కి తగ్గేది లేదని సిఎం తేల్చి చెప్పారు.

అనుమతిచ్చిన అధికారులపై విచారణ
చెరువుల్లోని ఆక్రమణలపై అధ్యయనం జరుగుతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని అందుకే వారి నిర్మాణాలపై దృష్టి పెట్టామని చెప్పారు. హైడ్రా ఏర్పాటు కు చట్టం అవసరం లేదని జీవో ఉంటే చాలన్నారు. జీవో 111పై సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని వివరించారు. జీవో 111పై గత ప్రభుత్వం
మభ్యపెట్టేలా వ్యవహరించిందన్నారు. జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కవితకు 5 నెలల్లో బెయిల్ రావడంపై చర్చ : కవితకు 5 నెలల్లోనే బెయిల్ రావడంతో చర్చ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదని చెప్పారు. మనీశ్ సిసోదియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని తెలిపారు. కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్ పని చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

ఆలస్యమైనా తప్పకుండా అందరికీ రుణమాఫీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు లక్షలకు పైబడిన రుణాలపై తాజాగా సీఎం క్లారిటీ ఇచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాస్త ఆలస్యమైనా తప్పకుండా అందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్లలో గ్రీవెన్స్ పెట్టామని వెల్లడించారు. రుణమాఫీ కానివారి లిస్ట్ కలెక్టరేట్లో ఇవ్వాలని అన్నారు. ఇప్పటివరకు 17, 933 కోట్లు జమ చేశామని చెప్పారు. రుణమాఫీ విషయంలో హరీష్ రావు సవాల్ చేసి పారిపోయారు అని ఎద్దేవా చేశారు.

రాజీనామా చేస్తానని చేయకుండా పారిపోయారని అన్నారు. హరీష్ రావుకు మాట్లాడే నైతికత లేదని సెటైర్లు వేశారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు దగ్గరకు వెళ్లండని అన్నారు. రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించండని, వివరాలు సేకరించి కలెక్టరేట్లో ఇవ్వండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, 22,37,848 ఖాతాలకు రూ.17,939 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ కానివారి జాబితాను కేటీఆర్, హరీశ్‌రావు ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News