Thursday, September 19, 2024

టార్గెట్ 40వేల మెగావాట్స్

- Advertisement -
- Advertisement -

భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా యాక్షన్
ప్లాన్ అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు
రైతులకు వంట గ్యాస్ బదులు సోలార్ సిలిండర్లు, సోలార్ పంప్‌సెట్లు ఇవ్వండి
కొండారెడ్డిపల్లినే పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోండి
ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరా ఆగదనే విశ్వాసం ప్రజల్లో కల్పించండి
విద్యుత్ శాఖపై సమీక్షలో సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉం చుకొని విద్యుత్‌ను అందుబాటులో ఉండేలా చూడాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖపై జరిగిన సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఐటీ, పరిశ్ర మల శాఖలతో సమన్వయం చేసుకొని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సిఎం పేర్కొన్నారు.

సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకో వాలని సిఎం రేవంత్ సూచించారు. రైతులకు సోలార్ పంప్‌సెట్‌లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలన్నారు. కొండారెడ్డి పల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సిఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు.

సోలార్‌ పంప్‌ సెట్‌ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్‌పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం రేవంత్ సూచించారు. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీటిపై మహిళా సంఘాల కు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలన్నారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని, ప్రణాళికాబద్దంగా వ్యవ హారించి దుబారాను తగ్గించాలని సిఎం రేవం త్ సూచించారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వ త పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరా యం ఉండొద్దని వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని, వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగనీ యొద్దని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News