Friday, April 18, 2025

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బి.మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది.

దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News