Friday, September 20, 2024

గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు

- Advertisement -
- Advertisement -

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టిపిసిసి ఎన్‌ఆర్‌ఐ సెల్ వినోద్ ఆధ్వర్యంలో రూపొందిన గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాల పై సమావేశంలో చర్చించారు. అందులో ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీ నీ ఏర్పాటు చేయాలని, అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , నాయకులు ఈ కమిటీ లో సభ్యులుగా నియమించి ఇందుకోసం జీవో విడుదల చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణి లో ఈనెల 20 వ తేది నుండి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.

గురుకుల పాఠశాలలో, కళాశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎన్‌ఆర్‌ఐ సెల్ సూచించింది. దీనిని తెలంగాణ ఏర్పడినప్పటి రోజు నుంచి, ఏరోజు తీసుకుంటే బాగుంటుందనే దానిపై కమిటీ లు పలువురు సూచనలు చేశారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పలు సలహాలు సూచనలు చేశారు. ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సిఎంఆర్‌ఎఫ్ నుండి వారికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరి గల్ఫ్ భీమా ఉండాలని సూచించారు. పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సింగపూర్, మలేషియా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సూచించారు.

టీపిసిసి ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్ లో గల్ఫ్ దేశాల్లో 18 దేశాలు ఉంటాయని అందులో సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకి వస్తాయన్నారు. తెలంగాణ లో 150 ట్రెడ్ లైసెన్స్‌మన్ పవర్ ఎక్సపోర్ట్ కంపెనీలు ఉన్నాయని సెట్విన్, టాంటం, న్యాక్ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని, అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే శవం రావడానికి వారం రోజులకు పైగా పడుతుందని దానిని 48 గంటల్లో ఇక్కడికి వచ్చేలా చూడాలని తెలిపారు. దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని, అక్కడ ఉన్న దానిని స్టడీ చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కేరళ లో జీడీపీకి ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తుందని తెలంగాణ లో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు డాక్టర్ సంజయ్ రేకులపల్లి భూపతి రెడ్డి , కె.ఆర్ నాగరాజు , మేడిపల్లి సత్యం, వాకిటి శ్రీహరి ముదిరాజ్ , సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిచాల రాజేందర్ రావు , వినయ్ రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News