Thursday, September 19, 2024

గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గచ్చిబౌలిలోని చిన్న అంజయ్యనగర్ వద్ద ఓ హోటల్‌లో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. నర్సింగ్ విద్యార్థిని శృతి హోటల్ గదిలో ఉరేసుకుంది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లగా పోలీసులు గుర్తించారు. నర్సింగ్ విద్యార్థిని మృతి ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హోటల్‌కు ఆమె ఎవరితో వచ్చారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురిని చంపేసి ఉరేశారని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News