Friday, September 20, 2024

రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బిఆర్‌ఎస్‌ది అనవసర రాద్ధాంతం:అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బిఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్న బిఆర్‌ఎస్ నాయకులు ఇంతకాలంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ఎందుకు మర్చిపోయారని, మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని బిఆర్‌ఎస్ నాయకులను ఆయన నిలదీశారు. తాము ఏకంగా సెక్రటేరియట్ లోపల తెలంగాణా తల్లి విగ్రహం పెడుతున్నామన్నారు. రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి బిఆర్‌ఎస్ నాయకులకు లేదని, మీ పార్టీ ఎప్పుడో ఖతం అయిపొయిందని ఆయన విమర్శించారు.

ప్రాణం పోయిన దేశం ముక్కలు కానివ్వబోనని చెప్పిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటున్న సన్నాసులు, దద్దమ్మలకు సోనియా కాళ్లు మొక్కినప్పుడు రాజీవ్ ఆమె భర్త అని గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపితో అగ్రిమెంట్ చేసుకొని ఇంకా మీరు పైకి లేస్తాం లాంటి డైలాగ్‌లు వద్దన్నారు. ఫాంహౌజ్ నుంచి బయటకు రాని మీకు రాజకీయ భవిష్యత్ లేదన్నారు. మరోసారి రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్న వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News