Friday, September 20, 2024

భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

భారత్‌లో ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో మంజేరి వైద్యశాలలో చేరి చికిత్సపొందుతున్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని , త్వరగా చికిత్స పొందాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాధితుడు ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి , తనకుటుంబం నుంచి ఐసొలేట్ అయ్యాడని పేర్కొన్నారు. అతడి నమూనాలను పరీక్షించగా మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెప్పారు. భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News