Friday, September 20, 2024

బిఆర్‌ఎస్ పాలనలో ఘనతను కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకుంటున్నారు: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ పాలనలో ఎంఎస్‌ఎంఇల అభివృద్ధి, బిఆర్‌ఎస్ సాధించిన విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. కెసిఆర్ పాలనలో ఎంస్‌ఎంఇలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శనంగా నిలిచాయని వెల్లడించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఇలు మూతపడినప్పటికీ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్‌ఎంఇలను దృఢంగా నిలిపాయని గుర్తు చేశారు. పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడంతో పాటు,

ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం 20 శాతం వృద్ధిరేటు సాధించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి మహిళలకు 30 శాతం ఉద్యోగ అవకాశాలు లభించాయని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఇ రంగంలో స్థిరమైన వృద్ధి నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిఆర్‌ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఎంఎస్‌ఎంఇల అభివృద్ధికి చేసిన కృషి, భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోచనీయం కాక మరేమిటని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News