Sunday, September 22, 2024

అవినీతిని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అవినీతిని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే కెటిఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ చేశారు. కెటిఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రేపు ఎక్కడికి రావాలో టైమ్ చెప్పు, మీది నిజమైతే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నీవు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి కెటిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ పగటి కలలు కంటున్నారని, మీ వెంట ఉండే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ గురించి కెటిఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతు న్నారని, చిత్తశుద్ధి ఉంటే కెటిఆర్ నా ఛాలెంజ్‌ను నిరూపించాలని, గంటలోనే తాను రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి కెటిఆర్‌కు సవాల్ విసిరారు.

గత ప్రభుత్వమే 3 ప్యాకేజీలుగా పిలిచి
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వమే రూ.3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచి అసెంబ్లీ పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందే హడావిడిగా ఈ టెండర్లను కట్టబెట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి రూ.8,888 కోట్ల అమృత్ టెండర్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిస్తే రూ.8,888 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఓపెన్ టెండర్లు పిలిచింది నిజమని, క్వాలిఫై అయిన కంపెనీలకే ప్రభుత్వం టెండర్‌లు ఇచ్చిందని మంత్రి తెలిపారు. దీనిలో దాపరికం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈసీ అనుమతి లేకుండా ప్రైస్ బిడ్లు ఓపెన్ చేశాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ టెండర్ల గురించి తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో ఈ టెండర్లు అగ్రిమెంట్ చేసి ఉండకపోతే వెంటనే క్యాన్సిల్ చేయాలని సిఎం అధికారులకు ఆదేశించారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆ తర్వాత పాత ఎస్‌ఎస్‌ఆర్‌తోనే మళ్లీ టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారని మంత్రి పొంగులేటి వివరించారు.

సృజన్‌రెడ్డి మీకే దగ్గరి బంధువు
మళ్లీ పిలిచిన టెండర్‌లలో సోదా కంపెనీ సృజన్‌రెడ్డి ఒకటి దక్కిచుకున్నారని పొంగులేటి చెప్పారు. ఈ సోదా కంపెనీ రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డిదని కెటిఆర్ అంటున్నారని, కానీ, సృజన్‌రెడ్డి తనపై పోటీ చేసిన బిఆర్‌ఎస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడని మంత్రి పొంగులేటి తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి బిఆర్‌ఎస్‌లో చేరినందుకు ఉపేందర్ రెడ్డి అల్లుడికి చెందిన సోదా కంపెనీకి అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ నంబర్ 7కు సంబంధించిన రూ.2,300 కోట్ల విలువ చేసే టన్నెల్ వర్క్‌ను రూ.1,100 కోట్ల వర్క్‌ను అఫీషియల్‌గా అప్పగించిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

విమర్శ చేస్తే పస ఉండాలి
ఈ మూడు వర్క్ల టెండర్ల వాల్యూ ఇప్పుడు రూ.3,687 కోట్లు అని పొంగులేటి తెలిపారు. ఆనాడు వాళ్లు టెండర్లు పిలిచినప్పుడు రూ.3,744 కోట్లు అన్నారని, మేం పిలిచిన రీటెండర్లలో గతం కంటే రూ.54 కోట్ల తక్కువకే బిడ్లు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం టెండర్ కంటే ఒక్క రూపాయి కూడా పెరగలేదన్న విషయాన్ని కెటిఆర్ గమనించకపోవడం బాధాకరమన్నారు. ఏదైనా విమర్శ చేస్తే పస ఉండాలని, కానీ, బట్ట కాల్చి మీద వేస్తామంటే ఆ మంటల్లో వారే కాలిపోతారని మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు. విమర్శలకు ఓ హద్దు ఉండాలని మంత్రి మండిపడ్డారు.కెటిఆర్ మిడిమిడి జ్ఞానంతో సిఎం, మంత్రులు, ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ తో రూ.34 వేల కోట్లను కొల్లగొట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్ సిద్ధంగా ఉండు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, ప్రతిపక్షం ఆధారాలతో మాట్లాడాలి, తప్పుంటే ప్రశ్నించాలి, పదేళ్లు అబద్దాలతో మోసం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజకీయాలకు రాక ముందే కాంట్రాక్టర్‌నని, తాను ఎవరికీ భయపడనని, నా పనుల గురించి మాట్లాడటానికి ఎప్పుడైనా సిద్ధమని,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News