Sunday, September 22, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంట్లు ఫుల్

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

శనివారం శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కాగా, సెప్టెంబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌రకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News