Sunday, September 22, 2024

రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక,టీమిండియా–బంగ్లాదేశ్​ జట్ల మధ్య సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ రెండో టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జట్టులో కేఎల్ రాహుల్ స్థానంపై చర్చలు జరిగినా.. ఫైనల్ గా సెలక్షన్ కమిటీ రెండో టెస్టుకు కూడా అదే జట్టును కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

రెండో టెస్టుకు టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News