Friday, September 27, 2024

రేప్ కేసుపై స్పందించిన హర్ష సాయి.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయి..

- Advertisement -
- Advertisement -

తనపై నార్సింగి పీఎస్‌లో నమోదైన అత్యాచార కేసుపై యూట్యూబర్ హర్షసాయి స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. అడ్వోకేట్‌తో సహా నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె హర్ష సాయితో పాటు అతడి తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై రేప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారంతో పాటు నగ్నచిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయిపై 376(2), 376ఎన్, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డిసిపి వెల్లడించారు. కాగా, యూట్యూబర్ గా నెటిజన్లకు సుపరిచితమైన హర్షసాయి హీరోగాను మారాడు. స్వీయ దర్శకత్వంలో ‘మెగా’ అనే చిత్రం ద్వారా వెండితెరపైకి అడుగుపెడుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News