Saturday, September 28, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. కోర్టు విచారణకు హాజరైన కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత బుధవారం కోర్టు విచారణకు హాజరయ్యా రు. లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు కవితతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు కూడా హాజరయ్యారు. కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. ప్రతివాదులకు సిబిఐ అందజేసిన ప్రతులు సరిగా లేవని విచారణ సందర్భంగా కోర్టుకు న్యాయవాదులు వెల్లడించారు. దీంతో, సరైన ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 27వ తేదీన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News