Friday, September 27, 2024

రేపు ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేపు ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రారంభిస్తారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ఈ ప్రత్యేక ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొననున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బుధ, శక్రవారాల్లో ఈ  ప్రత్యేక కౌంటర్ తెరిచి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News