Friday, September 27, 2024

28న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు 28వ తేది ఉదయం, రాత్రి 7గంటలకు పలు జంక్షన్లలో అమలులో ఉంటాయి. బేగంపేట, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పిఎన్‌టి జంక్షన్, రసూల్‌పుర, సిటిఓ జక్షన్,ప్లాజా, టివోలి, సికింద్రాబాద్ క్లబ్, కార్ఖానా, తిరుమలగిరి క్రాస్ రోడ్డు, లోతుకుంట, బొల్లారం, రాష్ట్రపతి నిలయం, దాని పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News